పేదలకు ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. మే 2022 వరకూ ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించాలని నిర్ణయించినట్లు సీఎం కేజ్రీవాల్ శనివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద ఉచిత ఆహార ధాన్యాల సరఫరా ఈ నెలతో(నవంబర్ 30) ముగియనుంది. అయితే.. తరువాత దీనిని పొడిగించే అవకాశం లేదని ఆరోగ్య శాఖ కార్యదర్శి సుదర్శన్ పాండే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి